నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 17 : ఎస్సారెస్పీ ప్రాజెక్టు సరస్వతీ కె నాల్ ద్వారా చివరి ఆయకట్టు వరకూ తాగు, సాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం శాస్త్రీనగర్లోని తన నివాసంలో ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సరస్వతీ కాలువ నుంచి చివరి ఆయకట్టుకు సాగునీరు అందడం లేదని పెంబి మండల రై తులు మంత్రి దృష్టికి తెచ్చారు. సరస్వతీ కాలువపై గాంధీనగర్ సమీపంలో ఆనకట్ట నిర్మించి తాగునీరు, సాగునీటిని మళ్లించడం వల్ల 1500 క్యూసెక్కులకు గానూ 1000 క్యూసెక్కుల నీటినే రైతులకు అందిస్తున్నామని అధికారులు మంత్రికి వివరించారు. ఆనకట్టను తొలగించి దానికి బదు లుగా క్రాస్ రెగ్యులేటరీని నిర్మిస్తే తాగు, సాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని, ఇందుకోసం రూ.కోటి నిధులు అవసరమవుతాయని మంత్రికి విన్నవించారు. నీరందని ప్రాంతాలకు తక్షణమే అందించేందుకు ఇందుకోసం సమష్టిగా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ సుశీల్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఈఈ రామారావు, తదితరులు పాల్గొన్నారు.