న్యూఢిల్లీ: కాబూల్ ( Kabul ) నుంచి భారతీయుల తరలింపు ప్రక్రియ ఇవాళ మొదలైంది. వైమానిక దళానికి చెందిన సీ-130జే ప్రత్యేక రవాణా విమానం బయలుదేరింది. దాంట్లో 85 మంది భారతీయులు ఉన్నారు. ప్రస్తుతం ఆ విమానం రీఫ్యుయలింగ్ కోసం తజకిస్తాన్లో ల్యాండ్ అయినట్లు ఓ వార్తా సంస్థ చెప్పింది. మరో వైపు స్టాండ్బైగా కూడా మరో విమానాన్ని సిద్ధంగా ఉంచారు. సీ-17 ట్రాన్స్పోర్ట్ విమానం రెఢీగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
సీ-17 విమానంలో సుమారు 250 మంది భారతీయుల్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం కాబూల్ నగరం తాలిబన్ల ఆధీనంలో ఉన్నది. అయితే ఎంత మంది విమానాశ్రయానికి చేరుకుంటారో చెప్పలేం. ఎయిర్ ఇండియా విమానాలను ఆపరేట్ చేయడం కష్టంగా ఉన్న నేపథ్యంలో కేవలం వైమానిక దళ విమానాలను నడపనున్నారు.