అలీగఢ్, మే 13: ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ)లో శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. క్యాంపస్ అంతా నిర్మానుష్యంగా మారింది. ఎక్కడైనా కాస్త జన సంచారం కనిపిస్తున్నదంటే అది ఏఎంయూ వద్ద ఉన్న శ్మశానవాటిక దగ్గరే. ఆ నలుగురు ఎవరో కాదు… తమకు అయినవాళ్ల అంత్యక్రియలు నిర్వహించడానికి వచ్చినవారు. గత కొన్ని రోజులుగా ఏఎంయూ ప్రస్తుత, రిటైర్డ్ అధ్యాపక సిబ్బంది దాదాపు 35 మంది కరోనా కాటుకు బలైపోయారు. వీరిలో మెడిసిన్ విభాగం చైర్మన్, లా ఫ్యాకల్టీ డీన్తో పాటు పలువురు ప్రముఖ అధ్యాపకులు కూడా ఉన్నారు. మరోవైపు ఏఎంయూ వద్ద శ్మశానవాటికలో ఖననం చేయడానికి చోటులేకుండాపోయింది. దాంతో ఇక్కడకు తీసుకువస్తున్న కరోనా మృతుల మృతదేహాలను ఖననం చేయడానికి చోటు కోసం పాత సమాధులను తవ్వుతున్నారు. రోజూ 8-10 మృతదేహాలను ఖననం చేయడానికి ఈ శ్మశానవాటికకు తీసుకువస్తున్నారని స్థానికులు తెలిపారు.