తైపే, ఏప్రిల్ 2: తైవాన్లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. సొరంగ మార్గంలో వెళ్తున్న ఒక రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 48 మంది మరణించగా, వంద మందికి పైగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో రైలులో 400 మంది కంటే ఎక్కువ ప్రయాణికులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. టొరోకోజార్జ్ అనే పర్యాటక ప్రాంతంలోని టన్నెల్ నుంచి రైలు బయటకు వస్తున్న క్రమంలో.. అక్కడే ఓ కొండ పైనుంచి ఒక ట్రాలీ పట్టాల పైకి దూసుకురావడంతోనే ఈ ప్రమా దం జరిగినట్టు అనుమానిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
అమెరికాను ప్రతిబింబిస్తున్న క్యాబినెట్: బైడెన్
‘గ్లోబల్ టీచర్’ మరియమ్మ కన్నుమూత