ఇన్స్టాగ్రామ్ ఖాతాలో బాలీవుడ్ యువ కథానాయిక జాన్వీకపూర్ పోస్ట్ చేసిన హాట్ఫొటోలు కొన్ని చర్చనీయాంశమయ్యాయి. దేశమంతా కరోనా సెకండ్వేవ్తో సతమతమవుతుంటే బాధ్యత లేకుండా అలాంటి ఫొటోలు పెట్టడమేంటని నెటిజన్లు విమర్శలు చేశారు. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకునేదాక వేచిచూడాల్సిందంటూ కొందరు సలహాలిచ్చారు. సోషల్మీడియా ట్రోల్స్పై జాన్వీకపూర్ వివరణ ఇచ్చింది. లాక్డౌన్ ముందు ఓ మాస పత్రిక కవర్పేజీ కోసం చేసిన ఫొటోషూట్ తాలూకు స్టిల్స్ అవని చెప్పింది. వాస్తవం తెలుసుకోకుండా తనను నెటిజన్లు అపార్థం చేసుకున్నారని వాపోయింది. తనకు సామాజిక బాధ్యత గురించి బాగా తెలుసునని, కరోనా మహమ్మారి నుంచి దేశం కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొంది. జాన్వీకపూర్ బాలీవుడ్లో ‘దోస్తానా’ ‘గుడ్లక్ జెర్రీ’ చిత్రాల్లో నటిస్తోంది.