కరోనాతో యువతి మృతి
అంత్యక్రియలు నిర్వహించిన సర్పంచ్
నర్సింహులపేట, మే 28: నిశ్చితార్థమైన పది రోజులకే కరోనాతో యువతి మృతిచెందిన ఘటన నర్సింహులపేట మండలం జయపురం గ్రామంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెంది న పానుగంటి పావని(22)కి పది రోజుల క్రితమే పెళ్లికి నిశ్చితార్థం జరిగింది. ఈ క్రమంలో తల్లి కనకమహాలక్ష్మి అనారోగ్యంతో ఈ నెల 24న మృతి చెందింది. తండ్రి యాకాంతాచారి కొన్నేండ్ల క్రిత మే చనిపోయాడు. పావని ఈ నెల 27న కరోనా టెస్టు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. ఇంట్లోనే మందులు వాడుతూ శుక్రవారం మృతి చెందింది. ఆమె దహన సంస్కారాలకు నా అన్నవాళ్లు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో గ్రామ సర్పంచ్ మందుల యాకన్న స్వయంగా ట్రాక్టర్ నడుపుకుంటూ పంచాయతీ సిబ్బందితో కలిసి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, గ్రామస్తులు యాకన్నను అభినందించారు.