న్యూఢిల్లీ: బంగారం అంటే భారతీయ వనితలకు ఎంతో ప్రీతి.. కరోనాతో గతేడాది ఆల్టైం రికార్డు ధర నెలకొల్పిన బంగారం ధరలు ఈ వారం స్వల్పంగా తగ్గాయి. ఈ వారం పది గ్రాముల బంగారం ధర రూ.76 తగ్గి రూ.48,578కి చేరుకున్నది. గత నెల 31వ తేదీన బులియన్ మార్కెట్లో తులం బంగారం రూ.48,654 పలుకుతున్నది. కనుక బంగారం కొనుగోళ్లు చేయాలని భావించే వారికి ఇదే సరైన సమయం అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
గతేడాది ఆగస్టులో ఆల్టైం రికార్డు నమోదు చేసిన తులం బంగారం ధర రూ.56,200కు చేరుకున్నది. దీంతో పోలిస్తే బంగారం ధర రూ.7,622 తగ్గిపోయింది. కిలో వెండి ధర రూ.1000కి పైగా తగ్గింది.
కిలో వెండి ధర కూడా రూ.333 కూడా తగ్గింది. గత వారం రూ.333 తగ్గి కిలో వెండి ధర రూ.70,167కి చేరుకున్నది. గత నెల 28వ తేదీన కిలో వెండి ధర రూ.70,500గా రికార్డైంది. ఈ నెలలో ఒకానొక దశలో కిలో వెండి ధర రూ.73 వేలు పలికింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,891 డాలర్లుగా ఉంది. మే నెల 28వ తేదీన ఔన్స్ బంగారం ధర 1904 డాలర్లుగా నమోదైంది. మున్ముందు ఔన్స్ బంగారం ధర 2000 డాలర్ల చేరువకు చేరుకుంటుందని అంచనా.
పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2-3 నెలల్లో దేశీయ మార్కెట్లో తులం బంగారం ధర రూ.48,000-50,000 మధ్య చేరుకుంటుందని రుంగ్టా సెక్యూరిటీస్ ఫైనాన్సియల్ ప్లానర్ హర్ష్వర్ధన్ రుంగ్టా వ్యాఖ్యానించారు.
మార్కెట్లలో స్థిరీకరణ కొనసాగుతుండటంతో ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ల వైపు మళ్లుతున్నారు. దీన్ని బట్టి బంగారం కొనుగోళ్లు కూడా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
ఈ ఏడాది చివరికల్లా తులం బంగారం ధర రూ.57వేల మార్క్కు చేరుతుందని ఇండియన్ బులియన్ అండ్ జ్యువెల్లర్స్ అసోసియేషన్ కార్యదర్శి సురేంద్ర మెహతా తెలిపారు.
మే నెలలో బంగారం మరింత ప్రియంగా మారింది. గత నెలలో తులం బంగారం ధర రూ.2,241 పెరిగింది. ఏప్రిల్ 30న రూ.46,791గా ఉన్న తులం బంగారం ధర, గత నెల 31న రూ.49,032కు చేరుకున్నది. కిలో వెండి ధర ఏప్రిల్ 30న 67,800 పలికితే, గత నెల 31న రూ.71,350లకు దూసుకెళ్లింది.
బంగారం గత కొన్నేండ్లుగా మదుపరులకు మంచి రిటర్న్స్ అందిస్తున్నది. ఐదున్నరేండ్లలో రెండు సార్లు బంగారం ధర రూ.49 వేల మార్క్ను దాటింది.
2016 జనవరి 27వ తేదీన తులం బంగారం ధర రూ.24,500 పలికింది. ఈ ఏడాది చివరికల్లా పది గ్రాముల బంగారం ధర రూ.60 వేలకు చేరువవుతుందని నిపుణుల అంచనా.
జూన్ 30 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ను పొడిగించిన పేటీఎం…
ఎస్బీఐ కస్టమర్లకు గమనిక.. ఆ పత్రాలు సమర్పిస్తేనే సేవలు
రాష్ట్ర ప్రభుత్వానికి 100 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు
తమిళనాడులో మరో వారం లాక్డౌన్ పొడగింపు
చరిత్రలో ఈరోజు : ఐదుగురిలో తొలిసారి ఎయిడ్స్ గుర్తింపు
ట్విటర్కు చివరి హెచ్చరిక జారీ చేసిన ప్రభుత్వం
కొవిడ్ కిట్ లో కరోనిల్ : పతంజలి ప్రతిపాదన వ్యతిరేకించిన ఐఎంఏ
ఢిల్లీ అన్లాక్.. సరి, భేసి విధానంలో మాల్స్, మార్కెట్లకు అనుమతి
వెంకయ్య ఖాతాకు బ్లూటిక్ రీస్టోర్ చేసిన ట్విటర్
జైసల్మేర్ జిల్లాలో పవర్గ్రిడ్ ఆక్సిజన్ ప్లాంటు…
ఆరెస్సెస్ చీఫ్ భగవత్ ట్విట్టర్ బ్లూటిక్ రిమూవ్, అయితే!
ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ చార్జీలు.. ఏ బ్యాంకులో ఎంత అంటే …?