బాన్సువాడ/బాన్సువాడ రూరల్/ రామారెడ్డి/మాచారెడ్డి/నిజాంసాగర్/దోమకొండ/ బీబీపేట్/ కామారెడ్డిరూరల్, జూన్ 1 : జిల్లావ్యాప్తంగా పలు గ్రామాల్లో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంగళవారం అందజేశారు. బాన్సువాడ పట్టణంలోని 19వ వార్డులో 43 మంది లబ్ధిదారులకు మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ పాలకవర్గసభ్యులతో కలిసి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ డాక్టర్ అంజిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ పాత బాలకృష్ణ, వైస్ చైర్మన్ షేక్ జుబేర్ పాల్గొన్నారు.
బాన్సువాడ మండలంలోని తాడ్కోల్ గ్రామంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను సర్పంచ్ కుమ్మరి రాజమణి స్థానిక నాయకులతో కలిసి అందజేశారు. ఏడుగురికి చెక్కులు మంజూరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజేశ్, వీఆర్వో వెంకటేశ్వర్లు, రైస్మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీ నూకల ఇంద్ర, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు లక్ష్మాగౌడ్, ఎస్ఎంసీ చైర్మన్ కుమ్మరి రాజు, రఘు, జనార్దన్గౌడ్ పాల్గొన్నారు.
రామారెడ్డి మండలకేంద్రంలోని రైతువేదిక భవనంలో వివిధ గ్రామాల లబ్ధిదారులకు ఎంపీపీ నారెడ్డి దశరథ్రెడ్డి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంగళవారం అందజేశారు. మండలంలోని రెడ్డిపేట్, సింగరాయిపల్లి, మద్దికుంట, అన్నారం, జగదాంబ తండా, ఘన్పూర్ తండా గ్రామాలకు చెందిన 79 మందికి చెక్కులు మంజూరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో రామారెడ్డి సర్పంచ్ సంజీవ్, టీఆర్ఎస్ యూత్ విభాగం మం డల అధ్యక్షుడు బండి ప్రవీణ్, ఆయా గ్రామాల సర్పంచులు రాంరెడ్డి, బుచ్చిరెడ్డి, సునందన, కుమారి అమృతాబాల్రాజు, ఎంపీటీసీలు రాజాగౌడ్, రాజేందర్, ఉపసర్పంచులు శ్రీనివాస్రెడ్డి, బాలయ్య పాల్గొన్నారు.
మాచారెడ్డి మండలకేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ ఆవరణలో లబ్ధిదారులకు జడ్పీటీసీ రాంరెడ్డి చెక్కులను పంపిణీ చేశారు. వివిధ గ్రామాలకు చెందిన 257 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు మంజూరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్రావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు హంజీనాయక్, వైస్ ఎంపీపీ జీడిపల్లి నర్సింహారెడ్డి, రైతుబంధు సమితి మండలకన్వీనర్ భుక్యా నర్సింహులు, టీఆర్ఎస్ మండల ప్రధానకార్యదర్శి పగడాల బాల్చంద్రం, ఎంపీటీసీలు, సర్పంచులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
నిజాంసాగర్ మండలంలోని వివిధ గ్రామాల లబ్ధిదారులకు టీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. తున్కిపల్లిలో టీఆర్ఎస్ నాయకులు లింగాల రామ్చందర్, విఠల్, జాగృతి మండల కన్వీనర్ ఆమేర్, ఉపసర్పంచ్ రాజు, నాయకులు సాయిలు, రవి, అరవింద్ రాములు ఎనిమిది మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. బ్రాహ్మణపల్లిలో సర్పంచ్ బాలయ్య, ఉపసర్పంచ్ వెంకటేశం నలుగురు లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.
దోమకొండ మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో వివిధ గ్రామాల లబ్ధిదారులకు ఎంపీపీ కోట సదానంద, జడ్పీటీసీ సభ్యుడు తిర్మల్గౌడ్ కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. మొత్తం 116 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు మంజూరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కుంచాల శేఖర్, సర్పంచ్ అంజలి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ నర్సారెడ్డి, తహసీల్దార్ అంజయ్య, సీనియర్ అసిస్టెంట్ రేఖ, ఆర్ఐ నరేందర్రెడ్డి, సర్పంచులు సూర్య ప్రకాశ్రెడ్డి, బురాని సమత, నర్సవ్వ, స్వరూప పాల్గొన్నారు.
]బీబీపేట్ తహసీల్ కార్యాలయ ఆవరణలో జడ్పీ వైస్చైర్మన్ పరికి ప్రేమ్కుమార్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఎంపీపీ బాలమణి లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. బీబీపేటలో 33 మందికి, మాందాపూర్లో 10 మందికి, రాంరెడ్డిపల్లిలో ఒకరికి, తుజాల్పూర్లో ఏడుగురికి, యాడారం లో ఐదుగురికి, మల్కాపూర్లో ఆరుగురికి, కోనాపూర్లో నలుగురికి, ఇస్సానగర్లో ఒకరికి, ఉప్పర్పల్లి ఆరుగురికి, జనగామ ఆరుగురికి మొత్తం 79 మంది చెక్కులు మంజూరైనట్లు వారు తెలిపారు. కార్యక్రమంలోరైతుబంధు సమితి మండల కన్వీనర్ నాగరాజ్గౌడ్, ఆయా సర్పంచులు పాల్గొన్నారు.
కామారెడ్డి మండల పరిషత్ కార్యాలయంలో వివిధ గ్రామాల లబ్ధిదారులకు ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, జడ్పీటీసీ సభ్యురాలు చిదుర రమాదేవి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచులు చింతల రవితేజాగౌడ్, హన్మాండ్లు, సాగర్గౌడ్, ఎంపీటీసీ కమ్మరి అనంతలక్ష్మి పాల్గొన్నారు.