న్యూఢిల్లీ: కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈ నెల 24న పార్టీ కీలక నేతలతో సమావేశం కానున్నారు. దేశంలోని రాజకీయ పరిస్థితులు, పార్టీ స్థితిగతులపై ఆ సమావేశంలో చర్చించనున్నారు. సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, అన్ని రాష్ట్రాల ఇన్చార్జీలు, పీసీసీ అధ్యక్షులు పాల్గొననున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమం జరుగనున్నది.
అన్ని రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల అనుభవాలను ఫీడ్బ్యాక్ రూపంలో సోనియా సేకరించనున్నారు. యువ నేతలు పార్టీని వీడుతుండటం, అంతర్గత కుమ్ములాటలు, కేంద్ర ప్రభుత్వ విధానాలు, కొవిడ్ అంశాలు సమావేశంలో చర్చకు రానున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.