టీఎన్జీవో ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
త్వరలో జిల్లాలో సీఎం కృతజ్ఞత సభ
టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్
మెదక్, మార్చి 22 : జిల్లా కేంద్రంలో ఉద్యోగుల సంబురాలు అంబరాన్నంటాయి. పటాకులు కాల్చి, కేక్ కట్ చేసి, సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ, ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సీఎం కేసీఆర్ 30 శాతం పీఆర్సీ ప్రకటించినందుకు సోమవారం టీఎన్జీవోల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ మాట్లాడుతూ ఉద్యోగులు, విశ్రాంతి ఉద్యోగులు, అన్ని వర్గాల ఉద్యోగులకు సీఎం కేసీఆర్ 30 శాతం పీఆర్సీ ప్రకటించడం పై కృతజ్ఞతలు తెలిపారు. మొట్టమొదటిసారిగా మెదక్ జిల్లా లో మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, కలెక్టర్, కేంద్ర సంఘ అధ్యక్ష, కార్యదర్శుల సారథ్యంలో టీఎన్జీవో ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్కు కృతజ్ఞత సభ నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. పదవీ విరమణ వయస్సు 61 ఏండ్లకు పెంపు సంతోషకరమైన విషయమన్నారు. మహిళా ఉద్యోగులకు 180 రోజులు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ప్రకటించారని, అర్హులైన ఉద్యోగులందరికీ త్వరలోనే ప్రమోషన్లు, వీఆర్ఏ, అంగన్వాడీ టీచర్లు, ఆశవర్కర్లకు పెరిగిన పీఆర్సీ వర్తిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాజ్కుమార్, ఉపాధ్యక్షురాలు అనురాధ, ఉపాధ్యక్షులు మంగ మనోహర్, ఇక్బాల్పాష, ఫజల్, ఫణీరాజ్, యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు శివాజీ, రామాగౌడ్, కార్యాలయ కార్యదర్శి రఘునాథరావు, ప్రచార కార్యదర్శి చిరంజీవులు, సంయుక్త కార్యదర్శి రాధ, కార్యవర్ల సభ్యులు లీలా, ప్రవళిక, మెడికల్ ఫోరం అధ్యక్షుడు అబ్రహం, మంజుల, వెంకట్, రమణ తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
పెద్దశంకరంపేట, మార్చి22: ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల వయో పరిమితి 61 సంవత్సరాల పెంపు, 30 శాతం ఫిట్మెంట్ పెంపు తో పెద్దశంకరంపేట మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, ప్రజాప్రతినిధులు పీఆర్టీయూ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్ , టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మురళీపంతులు, పీఆర్టీ యూ మండల అధ్యక్షుడు రామచంద్రాచారి, ఐసీడీఎస్ సూపర్వైజర్ శ్రీశైల, పీఆర్టీయూ నాయకులు గోపి, ప్రసన్న, సంతోశ్, రఘునాథ్రావు పాల్గొన్నారు.
పీఆర్సీ ప్రకటన పై పీఆర్టీయూటీఎస్ హర్షం
హవేళిఘనపూర్, మార్చి22:: అసెంబ్లీ లో ముఖ్యమంత్రి కేసీఆర్ పీఆర్సీ ప్రకటించడతో పాటు సమస్యలను ప్రస్తావించి పరిష్కరిస్తానని ప్రకటించడంతో హవేళిఘనపూర్ పీఆర్టీయూటీఎస్ ఆధ్వర్యంలో సోమవారం సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో పీఆర్టీయూటీఎస్ మండల అధ్యక్షుడు సతీశ్రావు, కార్యదర్శి సుభాశ్రెడ్డి, వెంకటేశ్, లావణ్య, రాజ్కుమార్ పాల్గొన్నారు.