హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): తెలుగు రాష్ర్టాలు కృష్ణా జలాల వి వాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ పిటిషన్లో న్యాయపరమైన అంశాల జోలి కి వెళ్లి అనవసరంగా జోక్యం చేసుకోలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. కృష్ణా జలాలను తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షం గా వాడుకొంటున్నదని ఏపీ దాఖలు చేసిన పిటిషన్ను సీజే జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్తో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. విచారణ ప్రారంభం కాగానే సీజేఐ జోక్యం చేసుకుంటూ ‘ఈ అంశంలో నేను న్యాయపరమైన అంశాల జోలికి వెళ్లదలుచుకోలేదు. నేను రెండు రా ష్ర్టాలకు (ఏపీ, తెలంగాణ) చెందినవాడిని. ఈ సమస్యను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించే అవకాశం ఉంటే తప్పకుండా ఆ పని చేయండి. అందుకు మేం సాయం చే స్తాం. తప్పనిసరిగా పిటిషన్ను విచారించాలని కోరితే దీనిని వేరే ధర్మాసనానికి బదిలీ చేస్తామ’ని పేర్కొన్నారు.
మూడోపక్షం జోక్యానికి తావివ్వద్దు
జలవివాదంలో మూడోపక్షం జోక్యానికి తావివ్వవద్దని రెండు రాష్ర్టాలకు సీజేఐ సూ చించారు. కృష్ణా జలాలపై కేంద్రం ఇప్పటికే గెజిట్ విడుదలచేసినందున ఈ పిటిషన్పై విచారణ అవసరంలేదని తెలంగాణ తరఫు న్యాయవాది వైద్యనాథన్ వాదించారు. గెజిట్ వెంటనే అమలయ్యేలా ఆదేశాలివ్వాలని ఏపీ తరఫు న్యాయవాది దుష్యంత్ దవే కోరారు. ఈ దశలో జోక్యం చేసుకున్న సీజేఐ, నీటి ఎద్దడి వచ్చినప్పుడే సమస్యలొస్తాయని, ఈ విషయంలో చాలాసార్లు వాదించానని గుర్తుచేశారు. ఈశాన్యంలో సరిహద్దు సమస్యలపై గొడవలు జరుగుతున్నాయని దుష్యంత్ దవే తెలుపగా, అలాంటి పరిస్థితులు కలలో కూడా రానీయొద్దని సీజేఐ స్పష్టంచేశారు. మధ్యవర్తిత్వ సూచనపై రెండు రాష్ర్టాల న్యాయవాదులు తమ ప్రభుత్వాలతో సంప్రదించి చెప్తామని కోరటంతో విచారణను ధర్మాసనం బుధవారానికి వాయిదా వేసింది.