న్యూఢిల్లీ, జూన్ 2: ఇండ్లు, స్థలాల గొడవలను పరిష్కరించే ఉద్దేశంతో తీసుకొచ్చిన నమూనా అద్దె చట్టానికి (మోడల్ టెనెన్సీ యాక్ట్-ఎంటీఏ) ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. అద్దె ఇండ్లు, స్థలాలకు సంబంధించిన నిబంధనల్లో ఉన్న లోటుపాట్లను సరిదిద్దడానికి ఈ చట్టం సాయపడుతుందని కేంద్రప్రభుత్వం పేర్కొంది. అద్దె ఇండ్ల గొడవలకు సంబంధించి ఇంటి యజమాని, అద్దెకుండేవారి (టెనెంట్) ప్రయోజనాలు కాపాడేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక జిల్లా రెంట్ అథారిటీ, కోర్టులు, ట్రిబ్యునళ్లను నియమిస్తున్నట్టు వెల్లడించింది. దీనికోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు హైకోర్టులను సంప్రదించి జిల్లా కోర్టు న్యాయమూర్తి లేదా జిల్లా కోర్టు అదనపు న్యాయమూర్తిని జిల్లా రెంట్ ట్రిబ్యునల్కు చీఫ్గా నియమించుకోవాలని సూచించింది. అన్ని రకాల ఆదాయవర్గాలకు తగిన అద్దె ఇండ్లను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్టు వివరించింది. తాజా చట్టం ఆధారంగా ఇప్పటికే ఉన్న అద్దె చట్టాలను తగిన విధంగా సవరించేందుకు వీలుగా అన్ని రాష్ట్రాలు, యూటీలకు దీన్ని పంపనున్నట్టు తెలిపింది.
అధికారిక అద్దె ఒప్పందం, అద్దెకుండే వారితో యజమాని ప్రవర్తించాల్సిన తీరు, ఇంటి వివాదాలు వంటి అంశాలను పరిష్కరించే ఉద్దేశంతో ‘నమూనా అద్దె చట్టం’ను కేంద్రప్రభుత్వం తీసుకొచ్చింది. దీని ప్రకారం..