పునరుద్ధరణ దిశగా ప్రతాపరుద్ర నక్షత్రశాల
గత పాలకుల నిర్లక్ష్యంతో దశాబ్దం నుంచి మూసివేత
మంత్రి కేటీఆర్ చొరవతో రంగంలోకి గ్రేటర్ కార్పొరేషన్
వారంలోగా భవన సామర్థ్యంపై నివేదిక
వరంగల్, జూలై 5 : ఖగోళ విజ్ఞానం, వింతలు, విశేషాలను భావితరాలకు అందించే ప్రతాపరుద్ర నక్షత్రశాల పుణరుద్ధరనపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ దృష్టి పెట్టింది. గత పాలకుల నిర్లక్ష్యంతో దశాబ్దం నుంచి మూతపడిన ఈ నక్షత్రశాలలో మళ్లీ ఖగోళ విజ్ఞానం వికసిస్తుందన్న ఆశలు చిగురిస్తున్నాయి. మూడు దశాబ్దాల క్రితమే వరంగల్లో ప్రతాపరుద్ర నక్షత్రశాలను ఏర్పా టు చేశారు. నాటి పాలకుల పట్టింపు కరువై అది మూతపడింది. అప్పటి ప్రభుత్వాలకు విన్నవించినా స్పందన లేదు. నిధులు వెచ్చిస్తే బాగుపడే అవకాశాలున్నా పాలకులు దష్టిసారించలేదు. అప్పట్లో అనేక జిల్లాల నుంచి విద్యార్థులు ఈ నక్షత్రశాలకు వచ్చేవారు. పాఠశాలల యాజమాన్యాలు విజ్ఞాన యాత్ర పేరిట వరంగల్ ప్రతాపరుద్ర నక్షత్రశాలకు విద్యార్థులను తీసుకొచ్చేవారు.
మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి..
విద్యార్థులకు ఖగోళ విజ్ఞానాన్ని అందించే ప్రతాపరుద్ర నక్షత్రశాల పుణరుద్ధరనపై రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. దీనికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నగర మేయర్ గుండు సుధారాణికి నక్షత్రశాల వాస్తవ పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దీంతో నాలుగు రోజుల కిత్రం నక్షత్రశాలను సందర్శించిన ఆమె, వారంలోగా నివేదిక ఇవ్వాలని అధికారుల ను ఆదేశించారు. భవన సామర్థ్యంపై నిపుణుల కమిటీ నుంచి నివేదిక తీసుకోవాలని బల్దియా ఇంజినీర్లకు సూ చించారు. నివేదిక అందిన వెంటనే మంత్రి కేటీఆర్ దృ ష్టికి తీసుకపోనున్నారు. పూర్తి స్థాయిలో ప్లానెటోరియం లో ప్రదర్శనలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.