హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్భవన్కు చేరుకున్నారు. రాజ్భవన్లో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. రాజ్భవన్లో గవర్నర్తో కలిసి సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు స్వాగతం పలకనున్నారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్గా ఎన్వీ రమణ పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి హైదరాబాద్కు వచ్చారు. తిరుపతి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ఆయనకు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా రాజ్భవన్ చేరుకుంటారు. మూడు రోజులు రాజ్భవన్లోనే బసచేయనున్నారు.