న్యూఢిల్లీ: ఎయిర్ కండిషనర్లో కొండచిలువ చుట్టుకుని పడుకున్న ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్నది. ఢిల్లీలోని ఛతార్పూర్ ఏరియాలోగల ఓ ఇంట్లో ఏసీ మొరాయించింది. దాంతో కుటుంబసభ్యులు ఏం జరిగిందో చూద్దామని ఆ ఏసీ డోర్ తెరిచి షాకయ్యారు. ఎందుకంటే అందులో రెండు అడుగుల పొడవుగల ఇండియన్ రాక్ పైథాన్ పిల్ల పడుకుని ఉన్నది. వెంటనే విషయాన్ని పాములను రక్షించే స్వచ్ఛంద సంస్థకు తెలియజేయగా వారు ఇద్దరు సిబ్బందిని ఘటనా ప్రాంతానికి పంపించారు. వాళ్లు దాదాపు 45 నిమిషాలపాటు శ్రమించి కొండచిలువను వెలికితీశారు. ఆ తర్వాత సమీప అటవీ ప్రాంతంలో దాన్ని వదిలేశారు.