అచ్చంపేట, ఏప్రిల్ 20: గ్రామాలను శుభ్రంగా ఉంచుకునేందుకు సర్పంచు లు చొరవ తీసుకోవాలని కలెక్టర్ శర్మన్చౌహాన్ అన్నారు. మంగళవారం బ ల్మూర్ మండలంలోని జిన్కుంట, గట్టుతుమ్మెన్, తుమ్మన్పేట, కొండారెడ్డిపల్లి, మహాదేవ్పూర్, పోలేపల్లి గ్రామాల్లో పర్యటించారు. మార్నింగ్ వాక్లో భా గంగా గ్రామాలను తనిఖీ చేసి అభివృద్ధి పనులను పరిశీలించారు. డ్రైనేజీలు ఎ ప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని గ్రా మ కార్యదర్శులను ఆదేశించారు. గ్రామ పల్లెప్రకృతి వనా లు పరిశీలించి సూచనలు చేశారు. మహాదేవ్పూర్లో శ్మశానవాటిక నిర్మాణ పనుల్లో జాప్యం వహిస్తున్న సర్పంచ్కు షోకాజ్ నోటీసు జారీ చేయాలని సంబంధిత మండలస్థాయి అధికారులను ఆదేశించారు. నర్సరీల్లో తప్పనిసరిగా కరివేపాకు, మునగ ఇతర పండ్ల మొక్కలు నాటాలని ఆదేశించారు. నర్సరీలపై సర్పంచులకు అవగాహన కల్పించారు. హరితహారంలో నాటిన ప్రతిమొక్కనూ సంరక్షించాలన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అవసరం ఉంటనే బయటకు రావాలని సూచించారు. మా స్కు లేకుండా బయటకు వస్తే రూ.1000 జరిమానా విధించాలని సర్పంచులు, కార్యదర్శులకు సూచించారు. ప్రజలు కరోనాపై నిర్లక్ష్యంగా ఉండరాదన్నారు. ప్రతిఒక్కరూ టీకా వేయించుకోవాలని అన్నారు. గ్రామాల్లో జాబ్కార్డులు ఉన్న వారందరికీ ఉపాధి పనులు కల్పించాలన్నారు. ఆయ న వెంట వివిధ శాఖల మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.