న్యూఢిల్లీ: ఆరేండ్ల చిన్నారిపై పక్కింటి వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఢిల్లీలోని త్రిలోక్పురిలో జరిగింది. ఈ ఘటనలో ఓ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ చిన్నారిపై లైంగిక దాడి జరిగిందని, తీవ్రంగా గాయాలవడంతో దవాఖానలో చికిత్స పొందుతున్నదని అధికారులు వెల్లడించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఢిల్లీ ఎయిమ్స్కు తరలించినట్లు తెలిపారు. తమ చిన్నారిపై పక్కింట్లోని 34 ఏండ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతనిపై పోస్కో చట్టం, ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదుచేశామన్నారు.