సిస్టర్ అభయ హత్య కేసులో సీబీఐ కోర్టు తీర్పు

కేరళ : 28 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన సిస్టర్ అభయ హత్య కేసులో సీబీఐ కోర్టు మంగళవారం తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఫాదర్ థామస్ కొట్టూర్, నన్ సెఫీని సీబీఐ కోర్టు దోషులుగా తేల్చింది. నిందితులిద్దరికి ఈ నెల 23న సీబీఐ కోర్టు శిక్షలను ఖరారు చేయనుంది. 1992 మార్చి 27న కొట్టాయంలో సిస్టర్ అభయ హత్యకు గురైంది. సిస్టర్ అభయను ఫాదర్ థామస్ కొట్టూర్, నన్ సెఫీ కలిసి హత్య చేసినట్లు కోర్టు నిర్ధారించింది. 28 ఏళ్ల తర్వాత హత్య కేసులో తీర్పు వెల్లడైంది.
కేసు పూర్వపరాలు.. 1992లో సిస్టర్ అభయ(21) కేరళలోని బీఎంసీ కాలేజీలో సైకాలజీ కోర్సు చేస్తోంది. అప్పుడు థామస్ కొట్టూరు సైకాలజీ అధ్యాపకుడిగా అక్కడ పని చేస్తున్నాడు. అయితే అదే ఏడాది మార్చి 27న తెల్లవారుజామున 4:15 గంటలకు సిస్టర్ అభయ తన హాస్టల్ నుంచి కిచెన్ వైపు వెళ్లింది. కిచెన్ వద్ద ఓ క్రైస్తవ సన్యాసినితో థామస్ కొట్టూర్, జోస్ పుత్రుక్కయిల్ అభ్యంతరకర రీతిలో కనిపించారు. ఈ తతాంగాన్ని చూసిన అభయ.. బయటకు చెబితే పరువు పోతుందనే భయంతో ఆమెను హత్య చేసి అక్కడున్న బావిలో పడేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు విషయాలు వెలుగు చూశాయి.
తాజావార్తలు
- కట్టమైసమ్మ చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహం
- చిక్కుల్లో నాని 'అంటే సుందరానికి '..!
- పక్కా కుట్రతోనే ఢిల్లీలో హింస: దిగ్విజయ్ సింగ్
- బిహార్లో కలకలం : బీజేపీ నేతపై కాల్పులు
- వరల్డ్ నంబర్ వన్ చేతిలో ఓడిన సింధు
- రైతు ఆందోళనపై 22 ఎఫ్ఐఆర్లు : రైతు నాయకులపై కేసులు
- చిక్కుల్లో విరాట్ కోహ్లి.. కేరళ హైకోర్టు నోటీసులు
- ఛత్తీస్గఢ్లో 24 మంది నక్సలైట్ల లొంగుబాటు
- స్నానాల గదుల్లోకి దూరి.. యువతుల లోదుస్తులు చించి..
- వేటగాళ్ల ఉచ్చుకు పులి మృత్యువాత