న్యూఢిల్లీ : కరోనాతో కుదేలైన ఆర్ధిక వ్యవస్ధకు మద్యంతో ఊపునిచ్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం సిద్ధమైంది. నూతన ఎక్సైజ్ విధానంతో రాష్ట్ర ప్రభుత్వం రానున్న 12 నెలల్లో రూ 3000 కోట్ల అదనపు ఆదాయం ఆర్జిస్తుందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బుధవారం తెలిపారు.
నగరంలోని 32 జోన్లలో మద్యం దుకాణాల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ 10,000 కోట్ల రాబడి సమకూరుతుందని ఆయన పేర్కొన్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తితో గత ఏడాది ఢిల్లీ ప్రభుత్వం రాబడిలో 41 శాతం తగ్గుదల నమోదైందని అన్నారు. ఇక ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలోనూ రాబడిలో 23 శాతం తగ్గిందని చెప్పారు.