భద్రాద్రి ఆలయంలో సీతారాముల కల్యాణం కన్నుల పండువగా జరిగింది. శ్రీరామనవమి సందర్భంగా మిథిలా స్టేడియంలో ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే రాములోరి కల్యాణ వేడుకను.. కరోనా ఉధృతి కారణంగా ఈ సారి బేడా మండపంలో భక్త జనుల సందడి లేకుండానే నిర్వహించారు. అభిజిత్ లగ్నంలో ఈ ఘట్టం పూర్తయింది. రామయ్య కల్యాణానికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ దంపతులు సమర్పించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ షురూ.. రోడ్లు ఖాళీ
ఎదురెక్కిన గోదారి.. పరవళ్లు తొక్కిన మానేరు
హాలియాలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఫోటోలు