శ్రీనగర్ : భారతీయ సైనికులకు కొత్త ఆయుధాలు వచ్చాయి. నియంత్రణ రేఖ వద్ద విధులు నిర్వర్తిస్తున్న సైనికులకు అత్యాధునిక రైఫిళ్లను అందించారు. సిగ్ సావర్ అజాల్ట్ రైఫిళ్లతో పాటు గలిల్ స్నైపర్ రైఫిళ్లను కూడా అక్కడ విధుల్లో ఉన్న సైనికులకు ఇచ్చారు. చొరబాటుదారులను అడ్డుకునేందుకు ఈ ఆయుధాలు ఉపయోగపడనున్నాయి. నియంత్రణ రేఖ వెంట జరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలను కూడా నియంత్రించేందుకు ఈ ఆధునిక ఆయుధాలు ఉపకరిస్తాయి. ఆధునిక ఆయుధాలు అత్యంత ప్రాణాంతకమైనవని ఇండియన్ ఆర్మీ అధికారులు చెప్పారు. పికా మెషీన్ గన్లు కూడా సైనిక సామర్థ్యాన్ని పెంచినట్లు అధికారులు వెల్లడించారు.