పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా నవ్జ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం సమన్వయంతోనే జరిగిందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపించింది. ఆ పార్టీ పంజాబ్ అధికార ప్రతినిధి అబ్బాద్ సింగ్ గ్రేవాల్ స్పందిస్తూ వచ్చే 72 గంటల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసిపోతారని చెప్పారు. నవ్జ్యోత్ సింగ్ సిద్ధూ ఆవేశంతో తీసుకున్న నిర్ణయం అని వ్యాఖ్యానించారు.
పీసీసీ అధ్యక్ష పదవికి నవ్జ్యోత్ సింగ్ రాజీనామాను ఆమోదించే ప్రసక్తే లేదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బవా హెన్రీ మీడియాకు చెప్పారు. ఆయన లేవనెత్తిన అంశాలు త్వరలో పరిష్కారం అవుతాయన్నారు. మూడు, నాలుగు అంశాలు ఉన్నాయి. వాటిని పార్టీ వేదికపైనా, హైకమాండ్ వాటిని పరిష్కరిస్తుందన్నారు.