న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: కరోనా టీకా తీసుకున్నవారిలో సగటున ప్రతి నలుగురిలో ఒకరు స్వల్పకాలవ్యవధిపాటు ఉండే తేలికపాటి ఆరోగ్య సమస్యలతో (సైడ్ఎఫెక్ట్స్తో) బాధపడుతున్నారని ఒక అధ్యయనంలో తేలింది. బ్రిటన్లోని కింగ్స్ కాలేజీ లండన్కు చెందిన పరిశోధకులు.. ఫైజర్, ఆస్ట్రాజెనెకా (మనదేశంలో ఈ టీకాను కొవిషీల్డ్ పేరుతో వినియోగిస్తున్నారు) టీకాలు తీసుకున్నవారిపై (6.27 లక్షల మందిపై) ఈ సర్వే జరిపారు. తలనొప్పి, నీరసం, చలి, డయేరియా, జ్వరం, ఒంటినొప్పులు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు.