చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నవ్జోత్సింగ్ సిద్దూ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర సీఎం అమరీందర్ సింగ్ హాజరయ్యారు. చాలా రోజుల నుంచి వీరిద్దరికి పొసగని విషయం తెలిసిందే. అయితే అధిష్ఠానం జోక్యంతో వీరిద్దరి మధ్య విభేదాలు కాస్త సద్దుమణిగాయి. అమరీందర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఇద్దరం కలిసి పనిచేస్తామన్నారు.