సిద్దిపేట : జిల్లాలోని తోగుట మండలంలో ఆదివారం విషాద సంఘటన చోటుచేసుకుంది. మండలంలోని జప్తిలింగారెడ్డిపల్లి గ్రామంలో ఓ వ్యక్తి చెరువులో మునిగి చనిపోయాడు. చేపల వేటకు వెళ్లిన గ్రామానికి చెందిన గుమ్ముల కనకయ్య ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. తోగుట పోలీసులు కేసు నమోదు చేశారు.