పూరీ జగన్నాథుడి రథయాత్ర సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. బలభద్రుడు, సుభద్రా దేవి, జగన్నాథుడి రథాలు ప్రధాన మందిరం నుంచి గుండీచ ఆలయానికి చేరుకొన్నాయి. రథయాత్ర సాఫీగా జరగడం పట్ల ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సంతోషం వ్యక్తం చేశారు. కరోనా కారణంగా ఈసారి కూడా రథయాత్రకు
భక్తులను అనుమతించలేదు. ముందుగా ఎంపిక చేసిన కొంత మంది పూజారులు మాత్రమే యాత్రను నిర్వహించారు.