హైదరాబాద్ : నిషేధిత పొగాకు ఉత్పత్తులను రవాణా, విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన హైదరాబాద్ నగర శివార్లలోని కవాడిపల్లి వద్ద శనివారం చోటుచేసుకుంది. మొత్తం 80 బస్తాల పొగాకు ఉత్పత్తులను ఓ ట్రక్లో తరలిస్తుండగా పట్టుకున్నారు. దీని విలువ రూ.25 లక్షలుగా సమాచారం. నిందితులను డ్రైవర్ ఎస్. అనిల్ కుమార్(36), కర్ణాటకలోని బీదర్ నివాసి డి. సుబ్బనా(40)గా గుర్తించారు. మరో వ్యక్తం పరారీలో ఉన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్లో ట్రాన్స్పోర్టు కంపెనీని రన్ చేసే సయ్యద్ సూచనల మేరకు నిందితులు బీదర్లోని ఆర్ఆర్ కంపెనీకి వెళ్లి పొగాకు ఉత్పత్తులను లోడ్ చేసుకున్నారు. అబ్దుల్లాపూర్మెట్ సమీపంలోని కవాడీపల్లికి చేరుకునేసరికి పోలీసులు వీరిని పట్టుకున్నారు.