పల్లె, పట్టణ ప్రగతి పనులు పూర్తి చేయాలి
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు
హన్మకొండ, జూన్ 14: ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 21వ తేదీన వరంగల్ పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీవోలు, మున్సిపల్, ఉద్యానవనశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న పల్లె, పట్టణ ప్రగతి పనులను సత్వరమే పూర్తి చేయాల ని ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రతిరోజూ సమర్థవంతంగా శానిటేషన్ చేపట్టాలన్నారు. స్టాం డింగ్ కమిటీలు పూర్తి స్థాయిలో పనిచేసేవిధంగా చూడాలన్నారు. సెగ్రిగేషన్ షెడ్స్, వైకుంఠధామాల్లో రక్షణకోసం ప్రహరీలు, గ్రీన్ ఫెన్సింగ్ నిర్మి ంచాలన్నారు. రహదారుల వెంట ఖాళీ ప్రదేశం లేకుండా ఎవెన్యూ ప్లాంటేషన్తో నింపాలన్నారు. గ్రామాల్లో సూచిక బోర్డులను తప్పకుండా ఏర్పా టు చేయాలని, గ్రామ సభలు సైతం క్రమం తప్పకుండా నిర్వహించి నూరుశాతం పన్నులు వసూ లు చేయాలన్నారు.
ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నందున హరితహారం చేపట్టేందుకు తక్షణమే గుంతలు తీయాలని, నాటే ప్రతి మొక్క బతకాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. సీజనల్ వ్యాధులపై జాగ్రత్తగా ఉండాలని, అధికారులు పల్లెల్లో రాత్రి బస చేసి, క్షేత్రస్థాయిలో తిరిగి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆన్లైన్ డిమాండ్ నోటీసులు వందశాతం జారీ చేయాలన్నారు. పట్టణాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, వరంగల్ నగరాన్ని అత్యంత పరిశుభ్రంగా ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వార్డు ల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పు డు తొలించాలన్నారు. అధికారులు సమన్వయం తో పని చేయాలని, మీ దృష్టికి వచ్చే సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్వో వాసుచంద్ర, డీఆర్డీవో శ్రీనివాస్కుమార్, డీంఎంహెచ్వో లలితాదేవి, డీపీవో జగదీశ్వర్, డీఈవో నారాయణరెడ్డి, డీసీవో నాగేశ్వర్రావు, మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీను, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు మంత్రి పరామర్శ
రాయపర్తి, జూన్ 14: మండలంలోని సన్నూరు గ్రామంలో ఇటీవల కరోనాతో మృతి చెందిన టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్ష, కార్యదర్శులు కుందూరి శ్రీనివాస్రెడ్డి, సుదగాని వెంకన్నగౌడ్ కుటుంబాలను సోమవారం సాయంత్రం రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పరామర్శించారు. ఓదార్చి ధైర్యం చెప్పారు. శ్రీనివాస్రెడ్డి, వెంకన్న మృతి తీరని లోటన్నారు. బాధిత కుటుంబాలకు భవిష్యత్లో పార్టీ పరంగా అండగా ఉంటామని తెలిపారు. మంత్రి వెంట ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమారస్వామిగౌడ్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్రావు, సర్పంచ్ నలమాస సారయ్య, ఆబోతు కొమురుమల్లు, చెల్లోజు వేణు, జీ జాజునాయక్, బీ సుధాకర్యాదవ్, ముత్తడి సాగర్రెడ్డి, తాళ్లపల్లి సంతోష్గౌడ్, మహినొద్దీన్, నాగరాజు, ఆశ్రఫ్పాషా, చందు రామ్యాదవ్, ఎల్లస్వామి తదితరులు పాల్గొన్నారు.