ముంబై: మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ కూటమిని విడదీయడం ఎవరివల్లా కాదని శివసేన పార్టీ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కలిసికట్టుగా ఉన్నాయని, ఆ మూడు పార్టీల నేతలు ఐదేండ్లు ప్రభుత్వాన్ని నడుపాలన్న దృఢ సంకల్పంతో ఉన్నారని ఆయన చెప్పారు.
కూటమిని విడదీసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న వారు అధికారం కోల్పోయినప్పటి నుంచి ఆ దిశగా అవిశ్రాంతంగా ప్రయత్నాలు చేస్తున్నారని రౌత్ పేర్కొన్నారు. కానీ తమ ప్రభుత్వం పూర్తికాలం కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కూటమికి బీటలు వేయాలని వాళ్లు ఎంత ప్రయత్నించినా, ఆ ప్రయత్నాలేవీ ఫలించవని రౌత్ వ్యాఖ్యానించారు.