సిస్వాన్ : పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ నివాసం ముందు ఇవాళ శిరోమనీ అకాలీ దళ్కు చెందిన కార్యకర్తలు భారీ ప్రదర్శన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ అకాలీ దళ్ నేతలు సిస్వాన్లోని సీఎం ఇంటిని ముట్టడించారు. అకాలీ దళ్ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు నీటి ఫిరంగులను వాడారు. శిరోమనీ అకాలీ దళ్ నేత సుక్బీర్ సింగ్ బాదల్ కూడా ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఏదైనా తుఫాన్ చెలరేగితే దాన్ని కెప్టెన్ ఆపలేరని, అన్ని శక్తులను వాడినా ఆ పని జరగదు అని, వ్యాక్సినేషన్ ప్రక్రియలో స్కామ్ జరిగిందని, ఫతేహ్ కిట్లోనూ మోసాలు జరిగాయని, ఎస్సీ స్కాలర్షిప్లోనూ స్కామ్ జరిగిందని, రైతుల భూములను లాక్కుంటున్నారని అకాలీదళ్ నేత సుక్బీర్ సింగ్ బాదల్ ఆరోపించారు.