న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వివిధ రంగాల పరిశ్రమలను కోలుకోలేని దెబ్బ తీసింది. పొదుపు చర్యల్లో భాగంగా కొన్ని సంస్థలు ఉద్యోగులను తొలగించడం లేదా వేతనాల్లో కోత విధించడం చేశాయి.
వ్యాపారులు తమ బిజినెస్ మూసేసుకున్న దాఖలాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమ పర్సనల్ ఫైనాన్సెస్పై ప్రజలంతా తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
ఆదాయం లేక, అనారోగ్య సమస్యలు.. కరోనా సోకి ప్రాణాలను కాపాడుకోవడానికి చాలా మంది అష్టకష్టాలు పడుతున్నారు.
దీంతో ప్రతి ఒక్కరూ తమ పర్సనల్ ఫైనాన్సింగ్ విధానాన్ని పూర్తిగా మార్చుకోవాల్సిన నేపథ్యాన్ని కోవిడ్-19 ఆవిష్కరించింది.
కోవిడ్-19 మహమ్మారి నేర్పిన గుణపాఠాలతో ప్రతి ఒక్కరూ తమ ఆర్థిక భవిష్యత్ గురించి పర్సనల్ ఫైనాన్స్ నిర్వహణపై ఫోకస్ చేయాలి.
పరిస్థితులు ఎల్లవేళలా దుర్భరంగా ఉండకపోవచ్చు గానీ, విభిన్న ఆదాయాలు ఉన్న వారు ఎమర్జెన్సీ ఫండ్ కలిగి ఉండటం అవసరం అన్న మాటలు వినిపిస్తున్నాయి.
పూర్ ఫైనాన్సియల్ ప్లానింగ్ ఉన్న వారు.. కష్ట కాలంలో తీసుకున్న ఎమర్జెన్సీ రుణాలు గానీ, ఆరోగ్య చికిత్స కోసం తీసుకున్న వారు వాటిని తిరిగి చెల్లించడం అంత తేలిక్కాదన్న విమర్శ ఉంది.
ఎవరైనా గట్టి ఫైనాన్సియల్ ప్లాన్ రూపొందించుకున్నా.. అందులో ఇన్సూరెన్స్కు చోటు కల్పించడం తప్పనిసరి. అనూహ్య పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని మహమ్మారి గుణపాఠం నేర్పింది.
ఇన్సూరెన్స్ మిమ్మల్ని కాపాడితే, ఎమర్జెన్సీ ఫండ్ సాయంతో మీ కుటుంబంలో అత్యంత ప్రేమికుల్ని కాపాడుకోవచ్చు. కనుక ప్రతి ఒక్కరి ఫైనాన్సియల్ ప్లాన్లో హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ కీలకం.
ఇన్సూరెన్స్ కవర్ లేకుండా దవాఖాన బిల్లులు చెల్లించడం చాలా కష్టం. అలాగే జీవిత బీమా తీసుకుంటే మీ అవసరాలకు రక్షణగా ఉంటుంది.
మీ కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని కోరుకుంటే మీరు జీవిత బీమా తీసుకోవాల్సిన అవసరం ఉంది.
హెల్త్ ఎమర్జెన్సీలో ఇన్సూరెన్స్ కవరేజీ మీకు రక్షణ కల్పిస్తుంది. అకస్మాత్గా ఉద్యోగం పోవడం లేదా వేతనాల్లో కోత విధించడం వంటి అనూహ్య పరిస్థితులు తలెత్తినప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ మీకు అవసరం.
కనుక ఫైనాన్సియల్ ప్లాన్లో ఎమర్జెన్సీ ఫండ్ తప్పనిసరి పరిస్థితి. ఎమర్జెన్సీ ఫండ్ మూడు నుంచి ఆరు నెలల ఖర్చులను కవర్ చేస్తుంది. కానీ ఎమర్జెన్సీ ఫండ్ తయారు చేయడానికి మాత్రం టైం పడుతుంది.
మీ వేతనంలో సగం పొదుపు చేయడం లేదా బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తే బెటర్గా ఉంటుంది. సదరు మొత్తంపై వడ్డీ రావడంతోపాటు రిస్క్ ఫ్రీగా ఉంటుంది.
ఇన్సూరెన్స్, ఎమర్జెన్సీ ఫండ్ కోసం పొదుపు చర్యలు చేపట్టిన తర్వాత పెట్టుబడులపై ఫోకస్ చేయాలి.
తక్కువ రిస్క్ ఉండి, అధిక రిటర్న్స్ వచ్చే ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టాలి.
మ్యూచువల్ ఫండ్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టడంతోనే సరిపెట్టుకోవద్దు. వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ వేళ ఆచితూచి వ్యవహరించాలి.
బంగారం లేదా గోల్డ్ బాండ్ల కొనుగోలును పరిశీలించాలి. విభిన్న పెట్టుబడి పథకాల్లో పెట్టుబడులు పెట్టినప్పుడు విపత్కర పరిస్థితుల్లో ఆదుకుంటాయి.
రియల్ ఎస్టేట్, బాండ్స్తోపాటు స్టాక్స్ వంటి దీర్ఘ కాలిక ఇన్వెస్ట్మెంట్లపై సహనంతో ఉంటే అధిక లాభాలు వస్తాయి. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి.
మీ భవిష్యత్ లక్ష్యాలకు అనుగుణంగా పర్సనల్ ఫైనాన్స్ను రూపొందించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.