మహబూబ్నగర్, ఏప్రిల్ 26: రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీపీ సుధాశ్రీ తెలిపారు. సోమవారం మహబూబ్నగర్ రూర ల్ మండలంలో మన్యంకొండ వద్ద పీఏసీసీఎస్ చైర్మన్ రాజేశ్వర్రెడ్డి, సర్పంచ్ చంద్రకళావెంకటస్వామి ఆ ధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, వైస్ ఎంపీపీ అనిత ప్రారంభించారు. రైతులు ధాన్యాన్ని పరిశుభ్రంగా తీసుకొచ్చి విక్రయించాలని తెలియజేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి, జెడ్పీ కో ఆప్షన్మెంబర్ అల్లావుద్దిన్, నేతలు దేవేందర్రెడ్డి, ఉప సర్పంచ్ శివరాజ్, నేతలు రాజేందర్రెడ్డి, చిన్నయ్య, లక్ష్మారెడ్డి, పాండురంగారెడ్డి, భీంరెడ్డి ఉన్నారు.
ఇవి కూడా చదవండి
మయన్మార్లో సహాయ నిరాకరణ ఉద్యమం
భువనగిరిలో రూ.20 లక్షల విలువైన గుట్కా పట్టివేత