సీజేఐ బోబ్డే కోరుకొన్నారు.. షారూక్ కూడా ఒప్పుకొన్నారు
సుప్రీం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ వెల్లడి
న్యూఢిల్లీ: అయోధ్య కేసు పరిష్కారానికి సుప్రీంకోర్టు నియమించిన మధ్యవర్తుల కమిటీలో బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ కూడా భాగస్వామి కావాలని సీజేఐ బోబ్డే కోరుకొన్నారు. అందుకు షారూక్ఖాన్ కూడా ఒప్పుకొన్నారు. ఈ ఆసక్తికర విషయాన్ని బోబ్డే పదవీ విరమణ సందర్భంగా సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ వెల్లడించారు. 2019లో అప్పటి సీజేఐ గొగోయ్ అయోధ్య వివాదం పరిష్కారానికి మధ్యవర్తుల కమిటీని నియమించారు. తర్వాత బోబ్డే సీజేఐ అయ్యారు. బోబ్డే అయోధ్య కేసును విచారిస్తున్న మొదట్లో.. షారూక్ మధ్యవర్తుల కమిటీలో సభ్యుడైతే బాగుంటుందని తనతో అన్నట్టు వికాస్సింగ్ తెలిపారు.