ఎన్సీపీ అధినేత శరద్ పవార్ హాస్పిటల్లో చేరారు. గతకొంతకాలంగా గాల్ బ్లేడర్ సమస్యతో బాధపడుతున్న ఆయనకు ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో సర్జరీ జరిగింది. ప్రస్తుతం శరద్ పవార్ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు స్పష్టం చేశారు.
మరోవైపు శరద్ పవార్ ఆరోగ్యంపై వదంతులు రావడంతో ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ స్పందించారు. అభిమానులు, కార్యకర్తలు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. శరద్ పవార్ ఆరోగ్యంగానే ఉన్నారని త్వరలో డిశ్చార్జ్ అవుతారని తెలిపారు.