ముంబై: మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై ముంబై పోలీస్ మాజీ కమిషనర్ చేసిన సంచలన ఆరోపణలపై రచ్చ కొనసాగుతోంది. తాజాగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ రంగంలోకి దిగారు. ఎన్సీపీ మంత్రులు, సీనియర్ నేతలను ఆయన ఢిల్లీకి పిలిచారు. ఆదివారం సాయంత్రం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అజిత్ పవార్, మంత్రి జయంత్ పాటిల్ ఢిల్లీ వెళ్లి పవార్ను కలవనున్నారు. అటు శివసేన నేత సంజయ్ రౌత్ కూడా పవార్ను కలవడానికి సిద్ధమవుతున్నారు. హోంమంత్రిపై వచ్చిన ఆరోపణలపై తాను పవార్తో చర్చించనున్నట్లు రౌత్ చెప్పారు. పవార్ సరైన నిర్ణయం తీసుకుంటారన్న నమ్మకం తనకు ఉందని ఆయన అన్నారు.
ఆత్మవిమర్శ చేసుకోవాలి
హోంమంత్రి అనిత్ దేశ్ముఖ్పై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని, ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని రౌత్ స్పష్టం చేశారు. ఏ మంత్రిపైనా ఇలాంటి విమర్శలు రాకూడదు. మహారాష్ట్రలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నించిన వాళ్లందరికీ ఇది షాక్ అని రౌత్ అన్నారు. దీనిని చాలా మంది లెటర్ బాంబ్గా పిలుస్తున్నారు. ఇందులో ఏమాత్రం నిజం ఉన్నా.. దీనిపై ముఖ్యమంత్రి, పవర్ సార్ చూసుకుంటారు. అనిల్ దేశ్ముఖ్ కూడా స్వయంగా విచారణ కోరారు. ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి అని రౌత్ స్పష్టం చేశారు.