ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులతో పాటు రాజకీయ అనిశ్చితి కూడా పెరుగుతున్నది. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో శనివారం రహస్యంగా భేటీ అయ్యారన్న వార్తలు సంచలనం కలిగించాయి. దీనిపై అమిత్ షాను ఆదివారం విలేకరులు ప్రశ్నించగా ఆయన నర్మగర్భంగా బదులిచ్చారు. సమావేశం జరిగిందా.. లేదా.. అన్నది చెప్పకుండా ‘అన్నీ బయటకు చెప్పలేం’ అంటూ దాటవేశారు. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై అవినీతి ఆరోపణల అంశంలో అధికార శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి మధ్య భేదాభిప్రాయాలు బయటపడుతున్న సమయంలో ఈ భేటీ వార్తలు రావడం గమనార్హం. గుజరాత్కు చెందిన స్థానిక వార్తా సంస్థ ఈ భేటీ అంశాన్ని వెల్లడించింది. శరద్ పవార్, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ ఇద్దరూ అహ్మదాబాద్లోని అమిత్ షా ఫాం హౌస్లో భేటీ ఆయ్యారని తెలిపింది. ఈ వార్తలను ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ ఖండించారు. అమిత్ షాతో పవార్ భేటీ కాలేదని చెప్పారు.
ఇవీ కూడా చదవండి..
వాట్సాప్లో నెలకు ఎన్ని మేసెజ్లు వెళ్తాయో తెలుసా?
ఈ క్రెడిట్ కార్డ్లతో ట్రాన్సాక్షన్లు చాలా డేంజర్.. తేల్చిన రీసెర్చ్