2001 కోల్కతా టెస్టుపై మంత్రి కేటీఆర్
హైదరాబాద్, ఆట ప్రతినిధి: భారత క్రికెట్ చరిత్రలో అపూర్వ విజయంగా నిలిచిన 2001 కోల్కతా టెస్టులో దిగ్గజాలు వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ వీరోచిత పోరాటాన్ని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. ఆస్ట్రేలియాపై ఆ అద్భుత విజయానికి ఆదివారం 20 ఏండ్లు పూర్తవడంతో దాన్ని గుర్తు చేసుకుంటూ లక్ష్మణ్ ట్వీట్ చేశాడు. 20 సంవత్సరాలు అయిందంటే నమ్మలేకున్నానని పేర్కొన్నాడు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘నిన్నే జరిగిందనేలా ఇంకా గుర్తుంది. మీ (లక్ష్మణ్), ద్రవిడ్ వీరోచిత పోరాటాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే – అది ఇతిహాసమే’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఫాలోఆన్కు దిగిన సమయంలో లక్ష్మణ్ 281, ద్రవిడ్ 180 పరుగులు చేయడంతో భారత్ 171 రన్స్తో ఆస్ట్రేలియాను చిత్తుచేయగలిగింది.