తుమ్ము, దగ్గు సాధారణంగా వస్తుంటాయి. ప్రస్తుతం అవి వచ్చాయంటే మనకు కరోనా వచ్చిందేమోననే భావన చాలా మందిలో ఉన్నది. ఇలాంటి దాన్ని సమ్మటైజేషన్ అంటారు. కరోనాను మనో ధైర్యంతో ఎదుర్కోవాలి. భయపడితే నిద్ర పట్టదు, చిన్న విషయం పెద్దదిగా కన్పిస్తుంది. మాస్క్ను సరైన పద్ధతిలో ధరించి, సామాజిక దూరం పాటిస్తూ, చేతులు శుభ్రంగా కడుక్కోవడంతో కరోనాను కట్టడి చేసే అవకాశముంది. అయినప్పటికీ కరోనా సోకితే ధైర్యంగా ఎదుర్కోవాలి. పోలీసులు, ప్రభుత్వం కోసం మాస్క్ ధరించడం కాదు.., మీ కోసం, మీ కుటుంబం కోసం మాస్క్ తప్పని సరిగా ధరించాలి. – డాక్టర్ వెంకటసుబ్బయ్య, క్లినికల్ సైకాలజిస్ట్, ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం