పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
రైతువేదిక ప్రారంభించిన ఎమ్మెల్యే మహేశ్రెడ్డి
గండీడ్, జూన్ 16 : రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పరిగి ఎ మ్మెల్యే మహేశ్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని పెద్దవార్వల్, (సల్కర్పేట) మన్సూర్పల్లి తండా, గండీడ్, నంచర్ల, మొకర్లాబాద్ గ్రామాల్లో రైతువేదికలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదన్నారు. వానకాలం పంటసాగుకు ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం అందిస్తున్నదని తెలిపారు.
ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రా మాల్లోనే వ్యవసాయాధికారులతో సలహాలు, సూచనలు పొం దడం, సమస్యలపై చర్చించేందుకు రైతువేదికలు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. అలాగే పెద్దవార్వల్లో పల్లెప్రకృతి వనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. పల్లెప్రకృతి వనం నిర్వహణ బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, ఎంపీపీ మాధవి, పీఏసీసీఎస్ చైర్మన్ కమతం శ్రీనివాస్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు గిరిధర్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ రుద్రారెడ్డి, వైస్ఎంపీపీ ఈశ్వరయ్యగౌడ్, పీఏసీసీఎస్ వైస్చైర్మన్ లక్ష్మీనారాయణ. ఎంపీడీవో రూపేందర్రెడ్డి, తాసిల్దార్లు జ్యోతి, రాంబాయి, వ్యవసాయాధికారి కృపాకర్రెడ్డి, ఏడీఏ వెంకటేశం, ఏఈవోలు గౌతమి, నిఖిత, మమత, లక్ష్మీకాంత్, విజయ్, మహేశ్, రైతుబంధు సమితి కన్వీనర్లు రాజీరెడ్డి, ప్రభాకర్రెడ్డి, భగవంతు, తిర్మల్రెడ్డి, రాజునాయక్, సర్పంచులు లలిత, జితేందర్రెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు గోపాల్, లక్ష్మీబాయి, చంద్రకళ, రక్షిత, అనసూయ, ఎంపీటీసీల సంఘం మండల అధ్యక్షుడు వెంకటేశం, నాయకులు గోపాల్రెడ్డి, రాంచంద్రారెడ్డి, రమేశ్రెడ్డి, గోపాల్, దస్తయ్య, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరికీ బియ్యం పంపిణీ చేయాలి
కరోనా కష్టకాలంలో ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న రేషన్ బియ్యాన్ని అర్హులందరికీ పంపిణీ చేయాలని ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అన్నారు. బుధవారం పెద్దవార్వల్ గ్రామంలో బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం ప్రతిఒక్కరికీ 15కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో రేషన్ డీలర్ గోవిందమ్మ పాల్గొన్నారు.