గురుగ్రామ్: ఒక భార్య తన భర్తను చాకుతో పొడిచి చంపింది. హర్యానాలోని గురుగ్రామ్లో ఈ ఘటన జరిగింది. సచిన్ అనే 39 ఏండ్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్ శుక్రవారం జ్యోతి పార్క్ కాలనీలోని తన ఇంటికి రాగా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ సందర్భంగా భార్య గుంజన్ వంట గదిలోని చాకుతో భర్త సచిన్ చెస్ట్పై పొడిచింది. తీవ్రంగా గాయపడిన సచిన్ను అతడి సోదరుడు ఆసుపత్రికి తరలించగా అధిక రక్త స్రావం వల్ల చనిపోయాడు. కాగా, భార్యభర్తలు గొడవ పడుతున్న సమయంలో అక్కడే ఉన్న వారి ఇద్దరి పిల్లలు ఈ ఘటనతో మానసిక ఒత్తిడికి గురైనట్లు పోలీసులు తెలిపారు. సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.