న్యూఢిల్లీ : కొవిడ్-19 సెకండ్ వేవ్ తో తల్లడిల్లుతున్న భారత్ కు అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం గోల్డ్ మన్ శాక్స్ రూ 70 కోట్ల అదనపు సాయం ప్రకటించింది. బెంగళూర్, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో ఆరోగ్య సదుపాయాల కల్పనకు సంస్థ తోడ్పాటు అందించనుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియకూ సాయం చేస్తామని స్పష్టం చేసింది.
పోర్టబుల్ కొవిడ్-19 కేర్ సెంటర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఐసోలేషన్ కేర్ యూనిట్లను సమకూరుస్తామని గోల్డ్ మన్ శాక్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. సెకండ్ వేవ్ తో కరోనా కేసులు విపరీతంగా పెరిగిన క్రమంలో గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్, బ్లాక్ స్టోన్ వంటి పలు ఐటీ, బహుళజాతి కంపెనీలు ఇప్పటికే భారత్ కు బాసటగా నిలుస్తామని ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.