National
- Jan 02, 2021 , 12:24:29
ఉగ్రవాదుల గ్రేనేడ్ దాడి.. ఏడుగురికి గాయాలు

పుల్వామా: జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు ఇవాళ గ్రేనేడ్ దాడికి పాల్పడ్డారు. పుల్వామా జిల్లాలోని త్రాల్ బస్సు స్టాండ్ వద్ద సెక్యూర్టీ దళాలపై ఉగ్రవాదులు గ్రేనేడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఏడుగురు పౌరులు గాయపడ్డారు. గాయపడ్డ వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని జేకే పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉన్నది. సహస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ)ను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు గ్రేనేడ్లను విసిరారు. కానీ టార్గెట్ తప్పడంతో ఆ గ్రేనేడ్లు రోడ్డుపై పేలాయి. ఆ ప్రాంతాన్ని పోలీసులు దిగ్భందం చేశారు. భారీ స్థాయిలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.
తాజావార్తలు
- దళిత రైతు కుటుంబాలకు ఆర్థిక తోడ్పాటు
- చంద్రబోస్ జయంతిని జయప్రదం చేయాలి
- ‘రామమందిర నిర్మాణంలో భాగస్వాములు కావాలి’
- ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్
- గోదారమ్మ పరుగులు..!
- టీఆర్ఎస్ బలోపేతానికి సైనికుల్లా పనిచేయాలి
- కోహ్లీ, హార్దిక్ పునరాగమనం
- అంగన్వాడీలకు డ్రెస్కోడ్..
- అందరూ హీరోలే..
- ఆర్టీసీకి సం‘క్రాంతి’
MOST READ
TRENDING