న్యూఢిల్లీ : ట్విట్టర్ ఛాలెంజర్ అయిన స్వదేశీ ట్విట్టర్ కూ యాప్ 30 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.218 కోట్లు) నిధి అందుకున్నది. టైగర్ గ్లోబల్ నేతృత్వంలోని సిరీస్ బీ నిధుల నుంచి ఈ మొత్తం అందుకున్నది. కూ యాప్కు ఇప్పుడు 60 లక్షలకు పైగా వినియోగదారులు ఉన్నారు. ఈ సంస్థ ప్రభుత్వ కొత్త నిబంధనలతో పనిచేస్తున్నది. ఎక్సెల్ పార్టనర్స్, కలరి క్యాపిటల్, బ్లూమ్ వెంచర్స్, డ్రీమ్ ఇంక్యుబేటర్ నుంచి వచ్చిన నిధులలో ప్రస్తుత పెట్టుబడిదారులు కూడా పాల్గొన్నారు.
కూ యాప్ గత వారం నుంచి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలను అమలు చేయడం ప్రారంభించింది. దేశంలో కొత్త ఐటీ నిబంధనల చర్చ తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఈ నిధిని కూ యాప్ సేకరించింది. దీనితో ట్విట్టర్, ఫేస్బుక్తో పాటు సోషల్ మీడియా సంస్థలకు జవాబుదారీతనం పెరిగినట్లయింది.
రాబోయే కొన్నేండ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో కూ యాప్ ఒకటిగా నిలుస్తుందని కూ వ్యవస్థాపకుడు రాధాకృష్ణ తెలిపారు. దీన్ని అభివృద్ధి చేయాలన్న కృతనిశ్చయంతో ఉన్నామని చెప్పారు. కాగా, కూ సంస్థ ప్రారంభమైన ఏడాదిలోనే 60 లక్షలకు పైగా డౌన్లోడ్లు జరిగాయి.
ఈ నెల ప్రారంభం నుంచి వినియోగదారులు ప్రాంతీయ భాషలను ఉపయోగించగలరని కూ సంస్థ తెలిపింది. దీనికి ప్రత్యేక బోర్డు అవసరం లేదని, వినియోగదారులు సందేశాన్ని మాట్లాడటం ద్వారాగానీ, టైప్ చేయడం ద్వారా గానీ పంపవచ్చు.
జూలై 5 న అమెజాన్ సీఈఓ పదవికి గుడ్బై చెప్పనున్న జెఫ్ బెజోస్
భారత్లో యాంటీబాడీ కాక్టెయిల్తో చికిత్స .. కరోనా నుంచి కోలుకున్న హర్యానా వాసి
కొవిడ్ నివారణలో ‘సెనోటైజ్’ 99 శాతం ప్రభావవంతం : గిల్లి రిగెవ్
భారత తొలి ప్రధాని నెహ్రూ కన్నుమూత.. చరిత్రలో ఈరోజు
వ్యాక్సిన్ నిలపాలంటూ పిటిషన్.. పిటిషన్దారుకు 50 వేల జరిమానా..
భారత్లో 130 రోజుల్లో 20 కోట్ల మందికి వ్యాక్సిన్
సముద్రంలో అరుదైన ఖనిజాలను కనుగొన్న జపాన్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..