న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్లో నదుల్లో మృతదేహాలు తేలడం తీవ్రమైన సమస్య అని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కరోనాతో చనిపోయినవారి హక్కులను పరిరక్షించడానికి విధి విధానాలను రూపొందించడంపై దాఖలైన పిటిషన్పై జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు, హేమంత్ గుప్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ఈ విషయంలో ఇప్పటికే కొన్ని ఆదేశాలు జారీ చేసినందున ఆ సంస్థను సంప్రదించాలని పిటిషనర్కు సుప్రీంకోర్టు సూచించింది.
మరోవైపు గంగా నదిలో మృతదేహాలు తేలడానికి బాధ్యులైన అధికారులపై దర్యాప్తు కోసం దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై (పిల్)పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిల్పై విచారణ జరుపడానికి నిరాకరించింది.