చెన్నై : ఎర్రచందనం అక్రమ రవాణాను కస్టమ్స్ అధికారులు గుర్తించి పట్టుకున్నారు. ఈ ఘటన తమిళనాడులోని చెన్నై పోర్టులో చోటుచేసుకుంది. చెన్నై ఓడరేవు వద్ద రూ .5.6 కోట్ల విలువైన 7.4 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు చెన్నై కస్టమ్స్ తెలిపింది. వీటిని తైవాన్కు ఎగుమతి చేస్తున్నట్లుగా తెలిపారు. చిన్న చిన్న పేవ్మెంట్ గ్రానైట్ రాళ్లతో నిండిన కంటైనర్లో ఈ దుంగలను దాచి అక్రమంగా రవాణా చేస్తున్నారు. అనుమానిత వ్యక్తుల కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.