బెంగళూర్ : కర్నాటకలో నాయకత్వ మార్పుపై ప్రచారం సాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని 30 మఠాలకు చెందిన సాధుసంతులు సీఎం యడియూరప్పకు మద్దతు పలికారు. యడియూరప్ప వల్లే రాష్ట్రంలో కాషాయ పార్టీ అధికారంలోకి రాగలిగిందని, ఆయనను తొలగిస్తే కర్నాటకలో బీజేపీ సమాధి అవుతుందని వారు హెచ్చరించారు. ఈ విషయం తాము చెప్పడం లేదని రాష్ట్ర ప్రజలందరి మనోగతం ఇదేనని దింగలేశ్వర్ స్వామీజీ స్పష్టం చేశారు.
హైకమాండ్ నిర్ణయానికి అనుగుణంగా వ్యవహరిస్తానని సీఎం పునరుద్ఘాటించారని వారు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఉండదని, తన పనితీరు పట్ల పార్టీ అగ్రనేతలు సంతృప్తిగా ఉన్నారని యడియూరప్ప ఇటీవల తన ఢిల్లీ పర్యటన సందర్భంగా పేర్కొన్నారు. తన రాజీనామాను ఎవరూ కోరలేదని, రాష్ట్రంలో నాయకత్వ మార్పు అంశం అసలు ప్రస్తావనకు రాలేదని చెప్పారు.