Floor Test in Assembly | పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ ప్రభుత్వాన్ని అసెంబ్లీ వేదికగా సభా విశ్వాస పరీక్షనెదుర్కోవాలని అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోరినట్లు సమాచారం. వీరంతా మాజీ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్కు మద్దతుదారులు అని చెబుతున్నారు.
సీఎం చరణ్సింగ్ చన్నీ తనను విశ్వాసం తీసుకోలేదని నవ్జ్యోత్ సింగ్ సిద్ధూ భావిస్తున్నట్లు సమాచారం. అందువల్లే సిద్ధూ తన పీసీసీ పదవికి రాజీనామా చేసి ఉంటారని భావిస్తున్నారు. సీఎం చన్నీ పట్ల సిద్ధూ అసంతృప్తిని తెలియచేస్తున్నదని సమాచారం. కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం సద్దుమణిగేందుకు వచ్చే 48 గంటలకు కీలకం అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
పార్టీలో సంక్షోభం తీవ్రమైన నేపథ్యంలో సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ.. బుధవారం ఉదయం 10.30 గంటలకు క్యాబినెట్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు మంత్రి, పార్టీ పదవులకు రాజీనామా చేసిన కాంగ్రెస్ నేతలు పాటియాలా హౌజ్లో సిద్ధూతో సమావేశమయ్యారు. వారిలో మంత్రి పదవులకు రాజీనామా చేసిన రజియా సుల్తానా, పర్గత్ సింగ్ తదితరులు ఉన్నారు.