శామీర్పేట, మే 18: జవహర్నగర్లో వరుస చైన్ స్నా చింగ్లు పోలీసులకు సవాలుగా మారాయి. ఒక నెలలోనే సుమారు ఆరు చైన్ స్నాచింగ్లు జరుగడం అవి పక్కపక్క కాలనీల్లోనే చోటు చేసుకోవడం పోలీసులకు ముక్కున వేలేసుకునే పరిస్థితి వచ్చింది. దీంతో పోలీసులు ఏసీపీ, సీఐల పర్యవేక్షణలో ఎనిమిది బృందాలు ఏర్పాటు చేశారు. బస్తీల్లో గస్తీలు పెంచి చెక్పోస్టుల వద్ద నిఘా పటిష్టం చేశారు. జవహర్నగర్ నుంచి యాప్రాల్కు వెళ్లే దారిలో బైక్పై అనుమానితులు ప్రయాణించారు. జవహర్నగర్ ప్రభుత్వ పాఠశాల ముందు ఏర్పాటు చేసిన చెక్పోస్టు వద్ద వాహనాల తనిఖీలు చేపడుతున్న పోలీసులకు వారు అనుమానంగా తారసపడ్డారు. సీసీ టీవీ ఫుటేజీల్ల్లో కనిపించిన బైక్ మాదిరిగా ఆ బైక్ ఉన్నందున ఆరాతీసేందుకు పోలీసులు ప్రయత్నించారు. పోలీసులను చూసి అనుమానితులు పారిపోయేందుకు యత్నించారు. విషయాన్ని పసిగట్టిన ఎస్ఐ మోహన్ సిబ్బందితో వెంబడించి వారిని పట్టుకున్నారు. అక్కడ నుంచి పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ విషయమై పోలీసులను సమాచారం కోరగా అలాంటిందేమి లేదని చెక్పోస్టు వద్ద అనుమానితులుగా ప్రయాణిస్తున్న వారిని విచారిస్తున్నట్లు పోలీసులు చెప్పకనే చెప్పారు. చెక్పోస్ట్ వద్ద అనుమానితులుగా పోలీసులు అదుపులోకి తీసుకున్న వారు వరుస చైన్ స్నాచింగ్లకు పాల్పడినవారే అయి ఉంటారని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుమానితులుగా పోలీసులు అదుపులోకి తీసుకున్న వారి పూర్తి వివరాలు తెలియరాలేదు.