శ్రీనగర్: ఉగ్రవాదులు దాగి ఉన్న ఒక ఇంటిని భద్రతా దళాలు పేల్చివేశారు. జమ్ముకశ్మీర్లోని పాంపోర్లో శనివారం ఈ ఘటన జరిగింది. ఉగ్రవాదులతో ఎన్కౌంటర్ సందర్భంగా భద్రతా దళాలు ఈ చర్యకు దిగాయి. ఇద్దరు ఉగ్రవాదులు ఉన్న ఇంటిని బాంబులతో పేల్చివేశాయి. ఈ ఘటనలో ఆ ఇల్లు ధ్వంసం కాగా అందులోని ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. లష్కరే తోయిబా అగ్ర కమాండర్ ఉమర్ ముస్తాక్ ఖండే ఈ ఎన్కౌంటర్లో మరణించాడు.
శ్రీనగర్లోని బాఘాట్లో ఇద్దరు పోలీసు సిబ్బందిని చంపడంతోపాటు ఇతర ఉగ్రవాద నేరాలలో ఉమర్ ముస్తాక్ ఖాండే పాల్గొన్నట్లు కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. జమ్ముకశ్మీర్ పోలీసుల టాప్ 10 టార్గెట్లతో అతడు ఒకడని పేర్కొన్నారు.