ముంబై: ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మన్ సురేశ్ రైనా ధనాధన్ బ్యాటింగ్తో అలరిస్తున్నాడు. గతేడాది టోర్నీకి దూరమైన రైనా ఈఏడాది సీజన్ తొలి మ్యాచ్లోనే అద్భుత అర్ధశతకం సాధించాడు. స్టాయినీస్ వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్ ఆఖరి బంతిని భారీ సిక్సర్ బాది 32 బంతుల్లోనే ఫిఫ్లీ పూర్తి చేసుకున్నాడు.
పవర్ప్లేలో వికెట్ కాపాడుకుంటూ భారీ షాట్లకు దూరంగా ఉన్న చెన్నై ఆ తర్వాత బౌండరీలపైనే దృష్టిసారించింది. దీంతో 8 ఓవర్లకు 48/2తో కష్టాల్లో ఉన్న జట్టు ఆ తర్వాత మెరుగైనస్థితికి చేరింది. 14 ఓవర్లకు చెన్నై 4 వికెట్లకు 124 పరుగులు చేసింది. ప్రస్తుతం రైనా(52), జడేజా(0) క్రీజులో ఉన్నారు.